యూపీలో ఆరుగురుకేంద్ర మంత్రులు ఔట్​

యూపీలో ఆరుగురుకేంద్ర మంత్రులు ఔట్​
  • అమేథీలో స్మృతి ఇరానీ ఓటమి

లక్నో:ఉత్తరప్రదేశ్​లో సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ) అత్యధిక స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీకి ఇక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు కేంద్రమంత్రులు ఓటమి పాల య్యారు. కీలక నియోజకవర్గమైన అమేథీలో పోటీ చేసిన స్మృతి ఇరానీ.. కాంగ్రెస్​ అభ్యర్థి కిశోరీ లాల్ ​చేతిలో ఓటమి పాలయ్యారు. ఖేరీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న కేంద్ర హోంశాఖ సహా యమంత్రి అజయ్​ మిశ్రా తేని పరాజయం చెందారు. ఇక్కడ సమాజ్​వాదీ పార్టీ(ఎస్పీ)కి చెందిన ఉత్కర్ష్​ వర్మ గెలుపొందారు.

మోహన్​లాల్ ​గంజ్​లో కేంద్ర సహాయ మంత్రి కౌశల్​ కిశోర్​ ఓటమి పాలయ్యారు. ఈయన ఎస్పీకి చెందిన ఆర్​కే చౌదరి చేతిలో ఓడిపోయారు. చందౌలీలో కేంద్రమంత్రి మహేంద్ర నాథ్​ పాండే.. ఎస్పీ అభ్యర్థి బీరేంద్ర సింగ్​ చేతిలో ఓటమి పాలయ్యారు.  ఫతేపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి నరేశ్​ ఉత్తమ్ పటేల్​ చేతిలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్​ జ్యోతి ఓడిపోయారు. జాలౌన్ ​నుంచి బరిలో నిలిచిన కేంద్రమంత్రి భానుప్రతాప్ ​సింగ్​ వర్మ కూడా ఓటమి పాలయ్యారు. ఎస్పీకి చెందిన నారాయణ్​ దాస్​ అహిర్​వార్​ ఇక్కడ గెలుపొందారు.